malayalam actress: దొంగనోట్లను ముద్రించిన కేసులో మలయాళ నటి అరెస్ట్

  • సీరియల్ నటి సూర్య శశికుమారి, ఆమె తల్లి, సోదరి అరెస్ట్
  • కొల్లాంలోని ఇంట్లో నోట్ల ముద్రణ
  • కొచ్చిలో అదుపులోకి తీసుకున్న పోలీసులు

నకిలీ నోట్లను ముద్రించిన కేసులో మలయాళం టీవీ సీరియల్ నటి సూర్య శశికుమార్ (36)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ఆమె తల్లి రీమా దేవి, సోదరి శ్రుతిలను కూడా అదుపులోకి తీసుకున్నారు. కొల్లాంలోని తమ ఇంటిలో రూ. 57 లక్షల దొంగ నోట్లను ముద్రించిన కేసులో... కొచ్చిలో వీరిని అరెస్ట్ చేసినట్టు ఇడుక్కి జిల్లా పోలీసు అధికారి వేణుగోపాల్ తెలిపారు. ఈ కేసులో రీమా దేవిని ప్రధాన నిందితురాలిగా అనుమానిస్తున్నామని చెప్పారు.

మీడియాతో పోలీసు అధికారి వేణుగోపాల్ మాట్లాడుతూ, కొల్లాంలోని వీరి నివాసం పైఅంతస్తులో దొంగనోట్ల ముద్రణ జరుగుతోందని చెప్పారు. ఈ నోట్లను ముద్రించేందుకు రూ. 4.36 లక్షలు ఖర్చు చేశారని తెలిపారు. వచ్చిన లాభాల్లో సగం వాటా ఇవ్వాలనే ఒప్పందంతో దొంగనోట్లను చలామణి చేస్తున్నారని చెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఇడుక్కిలో మూడు రోజుల క్రితం రూ. 2.25 లక్షల నకిలీ నోట్లను పోలీసులు సీజ్ చేశారు. ముగ్గుర్ని అరెస్ట్ చేసి, విచారించగా... సూర్య శశికుమార్, ఆమె తల్లి, సోదరిల పేర్లు వెలుగులోకి వచ్చాయి.  

More Telugu News