nagachaitanya: 'సవ్యసాచి'కి హిట్ తప్పదన్న నాగ్

  • చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి'
  • చైతూ సరసన నాయికగా నిధి అగర్వాల్ 
  • ఆగస్టులో భారీస్థాయి విడుదల  

నాగచైతన్యకి 'ప్రేమమ్'తో హిట్ ఇచ్చిన చందూ మొండేటి, ఆయనతో 'సవ్యసాచి' సినిమా చేస్తున్నాడు. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రఫ్ కట్ ను నిన్న నాగార్జున చూశారట. అవుట్ పుట్ బాగా వచ్చిందంటూ చందూ మొండేటిని అభినందించారని సమాచారం.అటు చందూ మొండేటి .. ఇటు నాగచైతన్య కెరియర్లో చెప్పుకోదగినదిగా ఈ సినిమా నిలుస్తుందని నాగార్జున మెచ్చుకున్నారట. ఈ సినిమా హిట్ కొట్టడం ఖాయమనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేయడంతో, టీమ్ లోని సభ్యులంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ ఫ్యామిలీకి సంబంధించిన సినిమాల రఫ్ కట్ చూసి నాగార్జున హిట్ అని చెప్పిన సినిమాలు హిట్ అవుతూ వచ్చాయి. ఏమీ చెప్పకుండా ఆయన మౌనంగా వెళ్లిపోయిన సినిమాలు ప్లాప్ అయ్యాయి. 'సవ్యసాచి' సినిమా పట్ల నాగ్ సంతృప్తిని వ్యక్తం చేయడంతోనే ఈ సినిమా సగం సక్సెస్ ను సాధించినట్టుగా భావిస్తున్నారు.        

More Telugu News