vikram: 'సామి స్క్వేర్'లో మరో హీరోయిన్ కి ఛాన్స్

  • విక్రమ్ హీరోగా 'సామి స్క్వేర్'
  • కథానాయికగా కీర్తి సురేశ్ 
  • ఐశ్వర్య రాజేశ్ కి చోటు    

విక్రమ్ పోలీస్ ఆఫీసర్ గా గతంలో చేసిన 'సామి' సినిమా తమిళనాట సంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమాను తెరకెక్కించిన హరి .. ఇప్పుడు సీక్వెల్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. విక్రమ్ సరసన కథానాయికగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ఈ సినిమాలో మరో కథానాయిక అవసరం కూడా ఉండటంతో కొంతమంది పేర్లను పరిశీలించారు.

తాజాగా ఆ పాత్ర కోసం ఐశ్వర్య రాజేశ్ ను తీసుకున్నారు. తమిళంలో ఐశ్వర్య రాజేశ్ కి మంచి క్రేజ్ వుంది .. ఆల్రెడీ విక్రమ్ జోడీగా ఆమె 'ధ్రువ నచ్చత్తిరమ్' సినిమా చేస్తోంది. 'సామి స్క్వేర్' సినిమాలోని రెండవ కథానాయిక పాత్రకి ఆమె అయితేనే సరిగ్గా సరిపోతుందని తీసుకున్నారట. ఈ అవకాశం తనకి రావడం పట్ల ఆమె చాలా హ్యాపీగా ఫీలవుతోంది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమా భారీస్థాయిలో విడుదల కానుంది. అందువలన ఈ సినిమాతో తెలుగులోను తనకి అవకాశాలు పెరుగుతాయని ఆమె భావిస్తోంది.        

More Telugu News