nithin: 'శ్రీనివాస కళ్యాణం' రిలీజ్ డేట్ ఖరారు

  • దిల్ రాజు నిర్మాణంలో 'శ్రీనివాస కళ్యాణం'
  • దర్శకుడిగా సతీశ్ వేగేశ్న 
  • కథానాయికలుగా రాశి ఖన్నా .. నందిత శ్వేత

కుటుంబ కథాచిత్రాలను నిర్మించడంలో దిల్ రాజు ఎంతో ఆసక్తిని చూపిస్తుంటారు. అలా ఈ మధ్య 'శతమానం భవతి' సినిమాతో విజయాన్ని అందుకున్న ఆయన, అదే తరహాలో 'శ్రీనివాస కళ్యాణం' సినిమాను నిర్మిస్తున్నారు. సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది. ఆగస్టు 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని దిల్ రాజు నిర్ణయించుకున్నారు. నితిన్ .. రాశి ఖన్నా జంటగా నటిస్తోన్న ఈ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని ఆయన భావిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం యూత్ కి బాగా నచ్చుతుందని నమ్ముతున్నారు. నందిత శ్వేత కీలకమైన పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో .. ముఖ్యమైన పాత్రల్లో భారీ తారాగణమే కనిపించనుంది. ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్ ను తెచ్చిపెడుతుందనే నమ్మకంతో నితిన్ వున్నాడు. ఆ నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.   

More Telugu News