bed: శుభవార్త.. ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అర్హులే!

  • కేంద్ర ప్రభుత్వ గెజిట్‌ విడుదల
  • అపాయింట్‌మెంట్‌ తరువాత రెండేళ్లలోపు బ్రిడ్జి కోర్సు నిబంధన
  • గతంలో ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అర్హులు కాదంటూ ప్రకటన

పాఠశాలల్లో ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అర్హులు కాదంటూ గతంలో ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. బీఈడీ అభ్యర్థులను స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకే అర్హులుగా పరిమితం చేయడం, ఆ పోస్టుల సంఖ్య తక్కువగా ఉండడంతో అభ్యర్థుల్లో టీచర్‌ ఉద్యోగాల పట్ల ఆసక్తి తగ్గింది. కాగా, ఈరోజు బీఈడీ అభ్యర్థులకు కేంద్ర సర్కారు శుభవార్త చెప్పింది. ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు అర్హులేనంటూ ప్రకటన చేస్తూ కేంద్రం గెజిట్‌ విడుదల చేసింది. కాగా, అపాయింట్‌మెంట్‌ తరువాత రెండేళ్లలోపు 6 నెలల బ్రిడ్జి కోర్సు చేయాలని నిబంధన విధించింది.            

More Telugu News