sensex: నిన్నటి నష్టాల నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్

  • మార్కెట్లను నిలబెట్టిన కొనుగోళ్లు
  • అంతర్జాతీయంగా బలహీన సంకేతాలున్నా లాభాల్లో క్లోజ్
  • 114 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

నిన్నటి భారీ నష్టాల నుంచి దేశీయ మార్కెట్లు నేడు కోలుకున్నాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ... ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 114 పాయింట్లు పెరిగి 35,379కి చేరింది. నిఫ్టీ 43 పాయింట్లు లాభపడి 10,700 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైమ్ టెక్నోప్లాస్ట్ (8.93%), జస్ట్ డయల్ (7.23%), ఫోర్టిస్ హెల్త్ కేర్ (6.85%), టాటా గ్లోబల్ బెవరేజెస్ (6.38%), అబాన్ ఆఫ్ షోర్ (5.92%).

టాప్ లూజర్స్:
ఐడీబీఐ బ్యాంక్ (-6.25%), అవంతి ఫీడ్స్ (-5.12%), వక్రాంగీ (-4.96%), క్వాలిటీ (-4.82%), ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్స్ (-3.92%).       

More Telugu News