naga chaitanya: 'శైలజా రెడ్డి అల్లుడు' థియేటర్లకు వచ్చేది అప్పుడే

  • మారుతి దర్శకుడిగా 'శైలజా రెడ్డి అల్లుడు'
  • చైతూ సరసన అనూ ఇమ్మాన్యుయేల్ 
  • ఆగస్టు 31వ తేదీన విడుదల            

మారుతి ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథలను సిద్ధం చేసుకుంటూ, వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ వస్తున్నాడు. తాజాగా ఆయన నాగచైతన్య కథానాయకుడిగా 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఆగస్టు 31వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

దాదాపు ఈ విడుదల తేదీ ఖరారైపోయినట్టేనని అంటున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, ముఖ్యమైన పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. పొగరుబోతు భార్య .. ఆమెను వెనకేసుకొచ్చే అత్తగారు .. ఆ ఇద్దరినీ దారికి తెచ్చే అల్లుడు నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుంది. గతంలో ఈ తరహా సినిమాలు చాలానే వచ్చినా .. ఈ కథలో వెరైటీ ట్విస్ట్ ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో తమన్నా .. చైతూలపై చిత్రీకరించనున్న 'నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయతు' సాంగ్ రీమిక్స్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.             

More Telugu News