Mumbai: అక్రమ నిర్మాణంపై ప్రియాంకాచోప్రాకు మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు!

  • ముంబైలోని అంధేరీ ప్రాంతంలో వాణిజ్య సముదాయం
  • అనుమతించిన ప్లాన్ ప్రకారం జరగని నిర్మాణాలు
  • ప్రియాంకకు రెండు నోటీసులు జారీ చేసిన బృహన్ ముంబై

ముంబైలోని అంధేరీ ప్రాంతంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంకా చోప్రా ఓ వాణిజ్య సముదాయాన్ని అనుమతి లేకుండా నిర్మించారని ఆరోపిస్తూ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. ఒషివారా ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను ఆమె చేపట్టారని ఇటీవల ఐదుగురు వ్యక్తుల నుంచి ఫిర్యాదు రాగా, అధికారులు వెళ్లి తనిఖీలు చేశారు.

జూన్ 2013లో తాము మంజూరు చేసిన ప్రణాళిక ప్రకారం కాకుండా, అక్రమంగా నిర్మాణాలు సాగించిన మాట వాస్తవమేనని గుర్తించిన అధికారులు, రెండు నోటీసులను ఆమెకు జారీ చేశారు. ఈ కమర్షియల్ కాంప్లెక్స్ లో ఉన్న అక్రమ నిర్మాణాన్ని తొలగించకుంటే, తామే కూల్చివేస్తామని స్పష్టం చేశారు. కాగా, వాస్తు కోసమే తాము కొన్ని మార్పులు చేశామే తప్ప, ఎలాంటి అక్రమ నిర్మాణాలనూ చేపట్టలేదని ప్రియాంకా చోప్రా సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

More Telugu News