babli project: సుప్రీం ఆదేశాలతో తెరుచుకున్న బాబ్లీ గేట్లు.. తెలంగాణకు పరుగులు పెడుతున్న గోదావరి

  • తెలంగాణ, మహారాష్ట్ర అధికారుల సమక్షంలో గేట్లు ఎత్తివేత
  • రేపు ఉదయానికి శ్రీరాంసాగర్ కు చేరనున్న నీరు
  • బాసరలో భక్తులు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిక

మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. ప్రతి ఏటా జూన్ 30వ తేదీ అర్ధరాత్రి దాటాక బాబ్లీ గేట్లు ఎత్తి, నీటిని కిందకు వదలాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ ఉదయం గేట్లను ఎత్తారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, బాబ్లీ ప్రాజెక్టు, కేంద్ర జల సంఘం అధికారులు ఈ ఉదయం ప్రాజెక్టు వద్దకు చేరుకుని, గేట్లు ఎత్తారు. రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. సాయంత్రంకల్లా 14 గేట్లు ఎత్తనున్నారు.

ప్రస్తుతం జలాశయంలో 0.56 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీరు చేరనుంది. ఈ రోజు నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచి ఉంటాయి. ఈ నేపథ్యంలో బాసర పుణ్యక్షేత్రం వద్ద పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

More Telugu News