Tamilnadu: కమలహాసన్ ఇల్లని తెలియకుండా దొంగతనానికి వచ్చిన యువకుడి అరెస్ట్!

  • తన ఇంటిని పార్టీ కార్యాలయంగా మార్చిన కమల్
  • నిన్న గోడ దూకి ప్రవేశించిన దొంగ
  • బంధించి పోలీసులకు అప్పగించిన ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది

ప్రముఖ నటుడు, 'మక్కల్ నీది మయ్యమ్' పేరిట రాజకీయ పార్టీని స్థాపించి, తమిళనాడులో సత్తా చాటాలని భావిస్తున్న కమలహాసన్ ఇంట్లో చోరీకి వచ్చిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని ఆళ్వార్ పేట, ఎల్డామ్స్ రోడ్డలో ఉన్న తన నివాసాన్ని పార్టీ ప్రధాన కార్యాలయంగా కమల్ మార్చగా, ప్రైవేటు సెక్యూరిటీ ఇక్కడ కాపలా కాస్తున్నారు.

నిన్న ఆ ఇంటి ప్రహరీ గోడ ఎక్కి లోపలకు దూకిన ఓ దొంగను గమనించిన సిబ్బంది, అతన్ని బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతన్ని దిట్టకుడి ప్రాంతానికి చెందిన శబరి నాథన్ గా గుర్తించిన పోలీసులు, దొంగతనం కోసమే అక్కడికి వెళ్లాడని తేల్చారు. అయితే, ఆ ఇల్లు కమల హాసన్ దన్న విషయం తనకు తెలియదని శబరి నాథన్ ఇచ్చిన వాగ్మూలంలో వెల్లడించాడట.

More Telugu News