Vijayawada: ఎన్నారై ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని రేప్ కేసు... ముగ్గురు కామాంధులను అరెస్ట్ చేసిన పోలీసులు!

  • సోమవారం నాడు కోర్టుకు నిందితులు
  • కస్టడీకి తీసుకుంటామని చెప్పిన పోలీసులు
  • ఎన్నారై కాలేజీపైనా కేసు

విజయవాడ సమీపంలోని ఎన్నారై కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం జరిపి, వీడియో వైరల్ చేసి, ఆపై కూడా బెదిరింపులకు గురి చేస్తున్న కేసులో ముగ్గురు నిందితులనూ అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ప్రకాశం జిల్లా ఉప్పలపాడుకు చెందిన కొత్త శివారెడ్డి, విజయవాడ రూరల్ కు చెందిన పిన్నబోయిన కృష్ణవంశీ, ఆగిరిపల్లి మండలం బొద్దనపల్లికి చెందిన దొడ్ల ప్రవీణ్‌ కుమార్‌ లను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. సోమవారం నాడు వీరిని కోర్టులో హాజరు పరిచి, కస్టడీకి తీసుకుంటామని పేర్కొన్నారు.

ఈ కేసు జిల్లాలో తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. జూనియర్ విద్యార్థినిని బర్త్ డే పార్టీకి పిలిచి రేప్ చేయడంతో పాటు, దాన్ని వీడియో తీసి, బెదిరింపులకు గురి చేసి, కాలేజీ యాజమాన్యం హెచ్చరికలతో వాటిని డిలీట్ చేసినట్టే చేసి తిరిగి వైరల్ చేసిన విద్యార్థులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. ఇక విషయం తమవరకూ వచ్చినా, కేవలం హెచ్చరికలతో సరిపెట్టిన ఎన్నారై ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యానికి నోటీసులు ఇవ్వనున్నామని డీఎస్పీ ప్రసాదరావు వెల్లడించారు. అత్యాచారాన్ని కప్పిపుచ్చాలని వారు చూశారని, విద్యార్థిని పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిని కాపాడాలని ప్రయత్నించడం చట్టరీత్యా నేరమని అన్నారు.

More Telugu News