Vijayawada: ఒకసారి రేప్ చేసి వీడియో తీసి... ఏడాదిగా దారుణం... విజయవాడ ఎన్నారై కాలేజీలో కలకలం!

  • పుట్టిన రోజు పార్టీ అని చెబితే నమ్మి వెళ్లిన విద్యార్థిని
  • వీడియోలను వైరల్ చేస్తామని బెదిరిస్తూ పదేపదే దుర్మార్గం
  • కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

పుట్టిన రోజు పార్టీ ఉందని చెబితే నమ్మి వెళ్లిన ఓ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు సహ విద్యార్థులు, వీడియో తీసి ఏడాదిగా ఆమెను లైంగికంగా వేధిస్తున్న ఘటన విజయవాడ సమీపంలోని అరిగిపల్లి ఎన్నారై కాలేజీలో తీవ్ర కలకలం రేపుతోంది. కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, తనకు స్నేహితురాలైన ఓ సహ విద్యార్థినిని వంశీకృష్ణ అనే విద్యార్థి, తన పుట్టినరోజు వేడుకలంటూ ఏడాది క్రితం ఆహ్వానించాడు.

ఓ హోటల్ లో వేడుక ఉందని చెబితే, నమ్మి సదరు విద్యార్థిని వెళ్లింది. అక్కడ మరెవరూ కనిపించక పోవడంతో అనుమానం వచ్చి అడిగేలోపే, తన మరో ఫ్రెండ్ శివారెడ్డి సాయంతో ఆమెపై అత్యాచారం చేసిన వంశీకృష్ణ, దాన్ని వీడియో తీయించాడు. ఇంట్లో చెబితే, వీడియోను వైరల్ చేస్తామని బెదిరించారు. దీంతో భయపడిన బాధితురాలు విషయం ఇంట్లో చెప్పకపోవడంతో దాన్ని అలుసుగా తీసుకుని, బెదిరింపులకు దిగుతూ, పలుమార్లు అత్యాచారం చేశారు. అంతటితో ఆగక, తమ ముఖాలను బ్లర్ చేసి, వీడియోలను స్నేహితులతో షేర్ చేసుకున్నారు.

ఈ వీడియోను చూసిన డీ ప్రవీణ్ అనే మరో విద్యార్థి, యువతికి ఫోన్ చేసి రూ. 10 లక్షలు ఇవ్వకుంటే తాను వీటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో భయపడ్డ బాలిక తల్లిదండ్రుల సాయంతో ఎన్నారై కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించగా, వారు పంచాయితీ నిర్వహించి, విద్యార్థులను పిలిపించి, వీడియోలు డిలీట్ చేయించి మందలించి పంపేశారు. సమస్య ముగిసిందని భావించిన తల్లిదండ్రులు, బాధిత విద్యార్థినికి వివాహం చేయించాలని నిర్ణయించగా, అప్పటికే ఎంతో మంది సెల్ ఫోన్లలోకి చేరిన వీడియో మరింతగా వైరల్ అయింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించి విషయం చెప్పడంతో, కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు విద్యార్థులను అరెస్ట్ చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

More Telugu News