India: పసికూనపై అలవోక విజయం... ఐర్లాండ్ ను మట్టికరిపించిన ఇండియా!

  • బ్యాటింగ్, బౌలింగ్ లలో రాణించిన టీమిండియా
  • టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్
  • 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు
  • 70 పరుగులకే కుప్పకూలిన ఐర్లాండ్

అంతర్జాతీయ క్రికెట్ లో పసికూన అయిన ఐర్లాండ్ పై భారత క్రికెటర్లు తమ ప్రతాపాన్ని చూపించారు. గత రాత్రి జరిగిన రెండో టీ-ట్వంటీలో తొలుత బ్యాటింగ్ తో, ఆపై బౌలింగ్ తో రాణించిన టీమిండియా 143 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్ ను ఓడించి 2-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది.

టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో రాహుల్ 70, రైనా 69, పాండ్యా 32 పరుగులు చేసి రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో జట్టు 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఆపై భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఐర్లాండ్ తడబడింది. రెండో బంతికే తొలి వికెట్ ను కోల్పోయిన ఆ జట్టును కుల్ దీప్, చాహల్ లు దెబ్బతీశారు. చెరో మూడు వికెట్లు తీసి ఐర్లాండ్ ను దెబ్బతీయగా, ఉమేష్ యాదవ్ 2 వికెట్లు తీశాడు.

ఈ మ్యాచ్ లో కీలకమైన ఆటగాళ్లు ధోనీ, ధావన్, భువనేశ్వర్, బుమ్రాలకు విశ్రాంతినిచ్చిన కెప్టెన్ కోహ్లీ, రాహుల్, దినేష్ కార్తీక్, ఉమేశ్ యాదవ్, సిద్ధార్థ్ కౌల్ లను తుది జట్టులో ఆడించాడు.  

More Telugu News