samantha: సమంతపై ప్రశంసలు కురిపించిన ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్

  • యాభై రోజులు పూర్తి చేసుకున్న ‘మహానటి’ 
  • మరో నటి చేయలేని విధంగా సమంత తన పాత్ర  పోషించారు
  • సినిమాపై, నటి సావిత్రిపై ఉన్న ప్రేమతో సమంత నటించారు

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ చిత్రం విడుదలై యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ ఓ పోస్ట్ చేశారు. ‘టైటిల్ రోల్ పోషించిన నటి కీర్తి సురేశ్ తో సమంత పోటీపడలేదు. లెజెండ్ సావిత్రి గారితో స్క్రీన్ టైం కోసం సమంత పోరాడారు. మరో నటి చేయలేని విధంగా సమంత తన పాత్ర పోషించారు. సినిమాపై, నటి సావిత్రి గారిపై ఉన్న ప్రేమతోనే ఈ చిత్రంలో సమంత నటించారు’ అని ప్రశంసించారు.

‘ఈ బయోపిక్ ను, ఓ చరిత్రను నిర్మించేందుకు సమంత సాయపడ్డారు..’ అని నాగ్ అశ్విన్ కొనియాడారు. కాగా, ఈ సినిమాలో కీర్తి సురేశ్.. సావిత్రిగా, దుల్కర్ సల్మాన్.. జెమినీ గణేశన్ పాత్రల్లో, సమంత, విజయ్ దేవరకొండ ఇతర పాత్రల్లో నటించారు.

More Telugu News