cuddapah: ఉక్కు ఉద్యమం తీవ్ర రూపం.. రేపు కడప జిల్లా బంద్

  • రేపు కడప జిల్లా బంద్ కు పిలుపు నిచ్చిన విపక్షాలు
  • సీపీఐ, సీపీఎం, వైసీపీ.. ఆధ్వర్యంలో జరగనున్న బంద్ 
  • కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు టీడీపీ ఎంపీల ప్రయత్నాలు

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్ గత తొమ్మిది రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విపక్షాలు కూడా తమ వంతు కర్తవ్యంగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు పోరుబాట పట్టాయి. ఈ నేపథ్యంలో రేపు కడప జిల్లా బంద్ కు పిలుపు నిచ్చాయి. సీపీఐ, సీపీఎం, వైసీపీ, బీఎస్పీ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ బంద్ జరగనుంది. మరోపక్క, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు టీడీపీ ఎంపీలు ఢిల్లీలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

More Telugu News