Pawan Kalyan: పిల్లల భవిష్యత్ కోసం పవన్ తో టచ్ లో ఉంటాను: నటి రేణూ దేశాయ్

  • నాకు పెళ్లయిన తర్వాత కూడా పవన్ తో టచ్ లో ఉంటా
  • ఎందుకంటే, ఇద్దరు పిల్లలకు ఆయన తండ్రి
  • ఓ అభిమాని ప్రశ్నకు రేణూ దేశాయ్ సమాధానం

నటి రేణూ దేశాయ్ తన రెండో పెళ్లి విషయం ప్రకటించినప్పటి నుంచి ‘ట్విట్టర్’ ద్వారా నెటిజన్లు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ స్పందించిన విషయం తెలిసిందే. దీంతో, తన ట్విట్టర్ ఖాతాను రేణూ దేశాయ్ ఇటీవలే డీయాక్టివేట్ చేసుకుంది. అయితే, రేణూ ను అభిమానించే వారు ఇన్ స్టా గ్రామ్ ఖాతా ద్వారా ఆమెను అనుసరిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ అభిమాని ఆమెను అడిగిన ప్రశ్నకు రేణూ స్పష్టంగా జవాబిచ్చింది.

‘మీకు పెళ్లయిన తర్వాత కూడా పవన్ తో టచ్ లో ఉంటారా?’ అని ఆ అభిమాని ప్రశ్నించగా.. ‘తప్పకుండా ఉంటాను. ఎందుకంటే, అకీరా, ఆద్య అనే ఇధ్దరు పిల్లలకు ఆయన (పవన్) తండ్రి. పిల్లల భవిష్యత్ కోసం ఆయనతో టచ్ లో ఉండాల్సిందే. పిల్లలకు సెలవులు వచ్చినప్పుడు లేదా ఏవైనా వేడుకలు, వచ్చినప్పుడు పిల్లలిద్దరూ ఆయన దగ్గరకు వెళతారు’ అని రేణూ చెప్పింది.

More Telugu News