airindia: ఎయిరిండియా విమానాన్ని ఢీ కొన్న పక్షి.. త్రుటిలో తప్పిన ముప్పు

  • పాట్నా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్‌
  • విమానంలో 124 మంది ప్రయాణికులు
  • పాట్నా-ఢిల్లీ విమానానికి అంతరాయం

ఎయిరిండియా విమానాన్ని ఓ పక్షి ఢీ కొట్టడంతో బీహార్‌ రాజధాని పాట్నాలోని జయప్రకాశ్‌ నారాయణ్ విమానాశ్రయంలో అత్యవసరంగా దానిని ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో ఆ విమానంలోని 124 మంది ప్రయాణికులు త్రుటిలో భారీ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. ఈ ఘటనపై అధికారులు మాట్లాడుతూ.. విమానానికి అకస్మాత్తుగా పక్షి అంతరాయం కల్పించిందని, అది పాట్నా-ఢిల్లీ విమానమని చెప్పారు. పక్షి ఢీ కొన్న కారణంగా గతంలో విమానాలు కూలిపోయిన సంఘటనలు ఉన్నాయి.                  

More Telugu News