Virat Kohli: కోహ్లీ, సింధులతో పాటు పలువురికి సరికొత్త ఛాలెంజ్‌ విసురుతూ.. వీడియో పోస్ట్ చేసిన సచిన్

  • నాకు ఇష్టమైన క్రికెట్ ఆడి వీడియోను షేర్‌ చేస్తున్నాను
  • మీకిష్టమైన ఆట ఆడి మీరూ షేర్‌ చేయండి
  • మీరందరూ ఎల్లప్పుడూ ఫిట్ గా ఉండాలి

సోషల్ మీడియాలో రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు విసురుతోన్న ఛాలెంజ్‌లు ప్రజల్లో పలు అంశాలపై అవగాహన పెంచుతున్నాయి. తాజాగా, టీమిండియా మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ సరికొత్త ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టారు. తాజాగా, ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేస్తూ... తనకు బాల్యం నుంచి ఆటలు ఆడటం అంటే ఇష్టమని, క్రికెట్ అంటే చాలా ఇష్టమని అన్నారు.

ఇప్పుడు తాను చేస్తోన్న ఓ ఛాలెంజ్‌ కేంద్ర మంత్రి రాథోడ్ చేసిన ఛాలెంజ్‌కు పొడిగింపుగా ఉంటుందని తెలిపారు. తానిప్పుడు తనకు ఇష్టమైన క్రికెట్ ఆడి ఆ వీడియోను షేర్‌ చేస్తున్నానని, అలాగే మీకిష్టమైన ఆట ఆడి మీరు కూడా మీ వీడియోలను షేర్‌ చేయండని కోరారు. మీరందరూ ఎప్పుడు ఫిట్ గా ఉండాలనుకుంటున్నానని అన్నారు. భారత క్రీడాకారులు సర్దార్ సింగ్, పీవీ సింధు, మిథాలీ రాజ్‌, విజేందర్ సింగ్, కిదాంబి శ్రీకాంత్, విరాట్ కోహ్లీలకు సచిన్‌ ఈ ఛాలెంజ్‌ విసిరారు.

More Telugu News