gopichand: 'పంతం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వేదిక ఖరారు

  • గోపీచంద్ హీరోగా 'పంతం'
  • కథానాయికగా మెహ్రీన్ 
  • వచ్చేనెల 5వ తేదీన రిలీజ్      

గోపీచంద్ హీరోగా మరో యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందింది. చక్రి దర్శకత్వంలో .. 'పంతం' అనే టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను వచ్చేనెల 5వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ లోగా ఈ నెల 30వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.

 హైదరాబాద్ .. గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్లో ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక జరుగుతుంది. గోపీచంద్ కి ఇది 25వ సినిమా కావడం వలన మరింత విశేషాన్ని సంతరించుకుంది. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక సతమతమైపోతోన్న గోపీచంద్, ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందని భావిస్తున్నాడు. ఆయనకి బాగా అచ్చొచ్చిన యాక్షన్ నేపథ్యంలోని కథ కాబట్టి.. ఆయన కోరిక నెరవేరుతుందేమో చూడాలి. 

More Telugu News