lalu prasad: బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్

  • తేజ్ ప్రతాప్ హీరోగా ‘రుద్ర.. ది అవతార్’ చిత్రం
  • ఫస్ట్ లుక్ విడుదల 
  • ఆకట్టుకుంటున్న పోస్టర్

బీహార్ మాజీ మంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. తేజ్ ప్రతాప్ హీరోగా రూపొందుతున్న హిందీ చిత్రం ‘రుద్ర.. ది అవతార్’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను తేజ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతున్నట్టు తెలిపారు. కాగా, 2016లో తేజ్ ప్రతాప్ బీహార్ వైద్య శాఖా మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే ఓ భోజ్ పురి సినిమాలో నటించిన తేజ్ ప్రతాప్.. సీఎం పాత్రను పోషించారు. తాజాగా, బాలీవుడ్ లోకి ‘రుద్ర.. ది అవతార్’ చిత్రం ద్వారా ప్రవేశించనున్నారు. 

More Telugu News