KTR: ప్రధాని మోదీని కలుసుకున్న మంత్రి కేటీఆర్.. ట్విట్టర్లో ఫొటోలు!

  • హైదరాబాద్ ఐటీఐఆర్ కు సంబంధించి అదనపు సమాచారం అందజేత
  • భయ్యారం స్టీల్ ప్లాంట్ హామీ ప్రస్తావన
  • ట్విట్టర్లో వెల్లడించిన మంత్రి కేటీఆర్

ప్రధానమంత్రి నరేంద్రమోదీని తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈ రోజు కలుసుకున్నారు. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రధానిని కలుసుకున్న గ్రూపు ఫొటో కూడా పోస్ట్ చేశారు. హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) కు సంబంధించి అదనపు సమాచారం కావాలని కోరడంతో, ఆ సమాచారాన్ని ఇచ్చినట్టు కేటీఆర్ తెలిపారు. అలాగే, ఖమ్మం జిల్లా భయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీని గుర్తు చేయడంతోపాటు, అందుకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందజేసినట్టు కేటీఆర్ పేర్కొన్నారు. ప్రధానిని కలుసుకున్న సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆయనకు శాలువా కప్పి ఓ మొక్కను అందజేయడం విశేషం.

More Telugu News