ramana dikshitulu: నన్ను చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి: బ్రాహ్మణ చైతన్య వేదిక కన్వీనర్ సిరిపురపు శ్రీధర్

  • గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావుకు ఫిర్యాదు చేశా
  • దీని వెనుక రమణదీక్షితుల హస్తం ఉంది
  • దీక్షితులు ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలి

టీటీడీపై రమణదీక్షితులు, ఏపీ ప్రభుత్వంపై ఐవైఆర్ కృష్ణారావు చేసిన ఆరోపణలను తిప్పికొట్టిన ఏపీ బ్రాహ్మణ చైతన్య వేదిక కో కన్వీనర్ సిరిపురపు శ్రీధర్ కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ, తనను చంపేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావుకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ఈ బెదిరింపు ఫోన్ కాల్స్ వెనుక రమణదీక్షితుల హస్తం ఉందంటూ ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. రమణదీక్షితులు ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని శ్రీధర్ డిమాండ్ చేశారు.

More Telugu News