CM Ramesh: ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్ష కొనసాగించరాదు... సీఎం రమేష్ కు స్పష్టం చేసిన డాక్టర్లు

  • ఏడవ రోజుకు చేరుకున్న సీఎం రమేష్ దీక్ష
  • తోడుగా దీక్ష చేస్తున్న బీటెక్ రవి
  • అపస్మారక స్థితిలోకి వెళ్లే ప్రమాదం
  • ఆసుపత్రులకు తరలించాలని అధికారులకు సిఫార్సు

కడపలో స్టీల్ ప్లాంటును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేస్తున్న ఆమరణ దీక్ష ఏడవ రోజుకు చేరుకోగా, ఆయన ఆరోగ్యం మరింతగా క్షీణించిందని ఈ ఉదయం ఆయన్ను పరీక్షించిన వైద్యుల బృందం వెల్లడించింది. ఆయనకు తోడుగా దీక్షకు దిగిన ఎమ్మెల్సీ బీటెక్ రవి పరిస్థితి కూడా అలానే ఉందని వైద్యులు వెల్లడించారు.

వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ దీక్షను కొనసాగించరాదని, మరో రోజు ఆహారం తీసుకోకుంటే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయే ప్రమాదముందని వైద్యులు తెలిపారు. వెంటనే వీరిని ఆసుపత్రులకు తరలించాలని ఉన్నతాధికారులకు సిఫార్సు చేయనున్నట్టు తెలిపారు.

More Telugu News