ys jagan: ఓ చిన్నారికి అక్షరాభ్యాసం.. ‘వైఎస్’ అని రాయించిన జగన్!

  • తూర్పు గోదావరి జిల్లాలో జగన్ ప్రజా సంకల్పయాత్ర
  • గెద్దాడలో ఓ చిన్నారికి అక్షరాభ్యాసం చేసిన జగన్
  • జగన్ తో సెల్ఫీలు దిగిన అభిమానులు

తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర నేడు 197వ రోజు సాగింది. ఈ సందర్భంగా జగన్ ని కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా జగన్ తో పలువురు సెల్ఫీలు దిగారు. గెద్దాడలో పర్యటించిన జగన్, ఓ చిన్నారికి అక్షరాభ్యాసం కూడా చేశారు. ఆ చిన్నారితో పలకపై ‘వైఎస్’ అనే అక్షరాలను రాయించి దిద్దించారు. కాగా, జగన్ చేపట్టిన పాదయాత్ర  లక్కవరం వద్ద 2,400 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకున్న విషయం తెలిసిందే.   

More Telugu News