danam: కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన దానం నాగేందర్

  • దానం, అనుచరులకు పార్టీ కండువా కప్పిన సీఎం కేసీఆర్
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు
  • తెలంగాణ భవన్ వద్ద దానం అనుచరుల సందడి

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన దానం నాగేందర్ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో దానం, ఆయన అనుచరులకు  సీఎం కేసీఆర్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు తదితరులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అవలంబిస్తున్న విధానాలకు ఆకర్షితుడనై టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు దానం ప్రకటించారు.     

More Telugu News