Vadodara: సెలవు కోసం 9వ తరగతి విద్యార్థిని స్కూల్లోనే హత్య చేసిన టెన్త్ స్టూడెంట్!

  • హోమ్ వర్క్ చేయని విద్యార్థి
  • స్కూలుకు సెలవు కోసం దారుణ హత్య
  • పోలీసుల అదుపులో పదవ తరగతి విద్యార్థి

తనకిచ్చిన హోమ్ వర్క్ చేయని ఓ టెన్త్ క్లాస్ విద్యార్థి, స్కూలుకు సెలవు ఇస్తే తప్పించుకోవచ్చన్న ఉద్దేశంతో దారుణం చేశాడు. వడోదరలో తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనలో 9వ తరగతి విద్యార్థిని, స్కూల్ బాత్ రూములో హత్య చేశాడు టెన్త్ క్లాస్ విద్యార్థి. తన వెంట తెచ్చుకున్న కత్తితో 10 సార్లు పొడిచాడు. ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించిన తరువాత, టెన్త్ విద్యార్థి ఈ దారుణానికి పాల్పడ్డాడని తేల్చిన పోలీసులు, 17 సంవత్సరాల యువకుడిని అదుపులోకి తీసుకుని బాల నేరస్తుల శిక్షణాలయానికి పంపారు.

ఈ కేసులో పోస్టుమార్టం రిపోర్టు ఇంకా రాలేదని పోలీసులు తెలిపారు. అతని మానసిక స్థితిపై వైద్యులు పరీక్షలు చేస్తున్నారని గుజరాత్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ జాగృతీ పాండ్య వెల్లడించారు. కాగా, గత సంవత్సరం గుర్ గావ్ లోని ఓ పాఠశాలలో పరీక్షలను వాయిదా వేయించాలన్న ఉద్దేశంతో ఏడేళ్ల బాలుడిని మరో విద్యార్థి గొంతు కోసి హత్య చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News