Telugudesam: టీడీపీ రాష్ట్ర, జిల్లా కార్యక్రమాలను బహిష్కరించిన పెడన పట్టణ కమిటీ!

  • నామినేటెడ్ పదవి కోసం వేణుగోపాలరావు ప్రయత్నం
  • నాలుగేళ్లుగా ఎదురుచూపులు
  • విజ్ఞప్తులు బుట్టదాఖలు

కృష్ణా జిల్లా టీడీపీ పెడన పట్టణ అధ్యక్షుడు, మునిసిపల్ మాజీ చైర్మన్  బొడ్డు వేణుగోపాలరావుకు నామినేటెడ్ పదవి ఇవ్వాలన్న విజ్ఞప్తులను పార్టీ పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ స్థానిక పార్టీ నేతలు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పార్టీ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర, జిల్లా కార్యక్రమాలను బహిష్కరించాలని నిర్ణయించారు. పట్టణ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చారు.

వేణుగోపాలరావు నాలుగేళ్లుగా నామినేటెడ్ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారు. స్థానిక నేతలు పలుమార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను కలిసి వేణుగోపాలరావుకు నామినేటెడ్‌ పదవి ఇప్పించాలని కోరారు. అయినప్పటికీ వారి విజ్ఞప్తులు బుట్టదాఖలు అవుతుండడంతో పార్టీ కార్యక్రమాలను బహిష్కరించాలని సమావేశంలో తీర్మానించారు.

More Telugu News