suicide: ప్రేమించిన యువకుడు మోసం చేశాడని లేఖ రాసి.. బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

  • కృష్ణా జిల్లాలో ఘటన
  • ఆ యువకుడి ఫోన్‌ నెంబర్‌ను లేఖలో రాసిన అమ్మాయి
  • తనను క్షమించమని తన తండ్రికి లేఖ

తనను ప్రేమించిన యువకుడు మోసం చేశాడని తన తండ్రికి సూసైడ్‌ లేఖ రాసి ఓ బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో జరిగింది. ఆమె పేరు లోయా రాణి అని, ఇంట్లోనే ఉరివేసుకొని ఈ ఘటనకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. తనను ప్రేమించిన యువకుడి ఫోన్‌ నెంబర్‌ను లేఖలో రాసింది. తాను తప్పు చేశానని, తన తండ్రి భావిస్తున్నట్లుగానే తాను ఒక అబ్బాయిని ప్రేమించానని, అన్నీ అయిపోయాక ఆ యువకుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడని ఆమె పేర్కొంది. అందుకే తాను చనిపోతున్నానని, తనను క్షమించమని తన తండ్రిని కోరింది.

More Telugu News