jc diwakar reddy: ఆరోగ్యం పాడు చేసుకోవద్దని సీఎం రమేష్ కు సలహా ఇచ్చా: జేసీ దివాకర్ రెడ్డి

  • మోదీ ఉన్నంత వరకు ఉక్కు ఫ్యాక్టరీ రాదు
  • ఎన్ని దీక్షలు చేసినా ఉపయోగం లేదు
  • దీక్షవల్ల ఉక్కు పరిశ్రమ ప్రాధాన్యత ప్రజలకు తెలుస్తుంది 

కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆమరణ దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిన్న దీక్షాస్థలికి వచ్చిన ఎంపీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, దీక్షలతో ఉక్కు రాదు... తుక్కు రాదు అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ఈరోజు ఆయన వివరణ ఇచ్చారు. నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నంత కాలం, స్టీల్ ప్లాంట్ కు మోక్షం లభించదని... ఈ నేపథ్యంలో, దీక్షలు చేసి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని సీఎం రమేష్ కు సలహా ఇచ్చానని చెప్పారు. ఎన్ని దీక్షలు చేసినా ఉపయోగం ఉండదని చెప్పానని తెలిపారు. కాకపోతే, దీక్ష వల్ల ఉక్కు పరిశ్రమ ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయవచ్చని చెప్పారు.

More Telugu News