ntr: ఎన్టీఆర్ .. ఏఎన్నార్ సావిత్రికి ఎంతగానో చెప్పారు .. ఆమె వినలేదు: సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి

  • సావిత్రి తన జీవితాన్ని తనే పాడుచేసుకుంది 
  • చెబితే వినిపించుకునేది కాదు 
  • ఆమెలో కొంత మొండితనం వుండేది    

ప్రముఖ సినీ జర్నలిస్ట్ గా .. సినీ విమర్శకుడిగా గుడిపూడి శ్రీహరికి మంచి పేరుంది. నాటి నుంచి నేటి వరకూ సినిమా ప్రపంచాన్ని .. అక్కడి పరిస్థితులను చాలా దగ్గర నుంచి చూస్తూ వచ్చినవారాయన. అలాంటి గుడిపూడి శ్రీహరి తాజాగా తెలుగు పాప్యులర్ టీవీతో మాట్లాడుతూ సావిత్రిని గురించి ప్రస్తావించారు.

"చిత్రపరిశ్రమలో స్టార్ స్టేటస్ కి చేరుకున్నవారికి .. ముందునుంచి కొంతమంది సపోర్ట్ గా వుంటూ వచ్చేవాళ్లు. ఆ స్టార్స్ వెలుగు తగ్గాక .. అప్పటివరకూ వాళ్లను సపోర్ట్ చేస్తూవచ్చిన వాళ్ల నిజస్వరూపం బయటపడేది. చాలామంది విషయంలో ఇది జరిగింది .. సావిత్రి విషయంలోనూ అదే జరిగింది.

సావిత్రి చేతులారా తన జీవితాన్ని తనే పాడు చేసుకుంది. జెమినీ గణేశన్ ను పెళ్లి చేసుకోవద్దని ఎన్టీఆర్ .. ఏఎన్నార్ ఇద్దరూ ఎంతగానో చెప్పారు. ఈ ఇద్దరితోను ఆమె ఎన్నో సినిమాలు చేయడం వలన మంచి సాన్నిహిత్యం ఉండేది. అందువలన ఇద్దరూ కూడా సావిత్రి మంచిని కోరుకునే ఆమెను వారించారు. అయినా ఆమె వినిపించుకోకుండా .. జెమినీ గణేశన్ ను పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది .. మొదటి నుంచి కూడా ఆమెలో కొంత మొండితనం ఉండేది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News