dhanush: షూటింగులో గాయమైనా లెక్కచేయని ధనుష్!

  • ధనుష్ హీరోగా 'మారి 2'
  • దర్శకుడిగా బాలాజీ మోహన్ 
  • సంగీత దర్శకుడిగా యువన్ శంకర్ రాజా

ఒక వైపున నిర్మాతగాను .. మరో వైపున హీరోగాను వరుస సినిమాలతో ధనుష్ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన 'మారి 2' సినిమా చేస్తున్నారు. సాయిపల్లవి .. వరలక్ష్మి శరత్ కుమార్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమా, షూటింగు దశలో వుంది. రీసెంట్ గా ధనుష్ తదితరులపై ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించారు.

అయితే పొరపాటున ధనుష్ కుడి కాలుకి .. ఎడమ చేతికి గాయాలయ్యాయట. ధనుష్ గాయపడటంతో .. పేకప్ చెప్పేద్దామని దర్శకుడు బాలాజీ మోహన్ అన్నప్పటికీ, ఆ తరువాత ఆ సీన్ చేయాలంటే మిగతా ఆర్టిస్టుల డేట్స్ దొరకడం ఇబ్బంది అవుతుందంటూ ధనుష్ షూటింగులో పాల్గొన్నారట. ఒకవైపున బాధను భరిస్తూనే ఆయన ఆ సీన్ ను పూర్తి చేసి .. యూనిట్ సభ్యుల నుంచి అభినందనలు అందుకున్నారని అంటున్నారు. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. 

More Telugu News