CM Ramesh: సీఎం రమేష్, బీటెక్ రవిలకు వైద్య పరీక్షలు

  • ఈనెల 20న ప్రారంభమైన ఆమరణ దీక్ష
  • వైద్య పరీక్షలు నిర్వహించిన రిమ్స్ వైద్యులు
  • సంఘీభావం తెలుపుతున్న పలువురు నేతలు

కడప ఉక్కు కర్మాగారం కోసం టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి చేపట్టిన ఆమరణదీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో వారి ఆరోగ్యం క్షీణించింది. ఈ నేపథ్యంలో ఈ ఉదయం వీరిద్దరికీ డాక్టర్లు వైద్య పరీక్షలను నిర్వహించారు. దీక్షా శిబిరానికి వచ్చిన రిమ్స్ వైద్యులు వీరికి అన్ని పరీక్షలు చేశారు. ఈ నెల 20న వీరిద్దరూ ఆమరణదీక్షకు దిగారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దీక్షాస్థలికి వచ్చి, వీరి దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు.

More Telugu News