assam: ఒకే బైక్‌పై అమ్మాయి, అబ్బాయి ఎందుకు వెళుతున్నారంటూ దాడి.. వీడియో వైరల్!

  • అస్సాంలో ఘటన 
  • గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి కొట్టిన వైనం
  • ఇద్దరి అరెస్ట్

అస్సాంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గోయల్పారా జిల్లాలోని ఓ గ్రామంలో బైకుపై వెళుతోన్న ఓ అబ్బాయి, అమ్మాయిని అడ్డగించిన కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. అనంతరం వారిని స్థానికులందరి మధ్యలో నిలబెట్టి పెళ్లి చేసుకోవాల్సిందిగా డిమాండ్‌ చేసి, చివరకు వదిలేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసుల దృష్టికి వచ్చింది.

ఈ ఘటనపై తమకు ఎవరు ఫిర్యాదు చేయలేదని, ఈ కేసును సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేపడుతున్నారని పోలీసులు చెప్పారు. ఇప్పటి వరకు ఈ ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో దాడికి గురైన యువకుడి సోదరుడు మీడియాతో మాట్లాడాడు. బైక్‌పై అమ్మాయి, అబ్బాయి వెళ్లడం ఏంటంటూ దూషణలకు దిగారని అన్నాడు. గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి పెళ్లి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి తీసుకువచ్చారని తెలిపాడు.                                                                                  

More Telugu News