jc: జేసీ మాటలను ఎవరూ పట్టించుకోవద్దు: మంత్రి ఆదినారాయణరెడ్డి

  • దీక్షలతో ఉక్కూ రాదు..తుక్కూ రాదన్న జేసీ వ్యాఖ్యలపై స్పందన
  • నిరాశపరిచేలా మాట్లాడటం తగదు
  • రాష్ట్రం పట్ల కేంద్రం ఇప్పటికీ వ్యతిరేకంగానే ఉంది

‘దీక్షలతో ఉక్కూ రాదు..తుక్కూ రాదు’ అంటూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేపట్టిన దీక్షపై ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి స్పందించారు. ఇప్పటికే రాష్ట్రం పట్ల కేంద్రం వ్యతిరేకంగా ఉందని, ఇలాంటి సందర్భాల్లో మరింత నిరాశపరిచేలా జేసీ మాట్లాడటం తగదని హితవు పలికారు. జేసీ వ్యాఖ్యలు సమంజసం కాదని, ఈ మాటలను ఎవరూ పట్టించుకోవద్దని, రాష్ట్రం పట్ల కేంద్రం ఇప్పటికీ వ్యతిరేకంగానే ఉందని అన్నారు. కడప జిల్లాకు ఉక్కు ఫ్యాక్టరీ సాధించే వరకూ తమ పోరాటం ఆగదని, కడప పౌరుషమేంటో చూపిస్తామని అన్నారు.

More Telugu News