bihar: పారిపోతుండగా బాలుడిని తుపాకీతో కాల్చి చంపిన తోట యజమాని!

  • బీహార్‌లోని గోర్గి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘటన
  • మామిడి పళ్ల కోసం వెళ్లిన బాలుడు
  • ఆగ్రహంతో ఊగిపోయిన యజమాని 

ఇండియాలోనూ గన్‌ కల్చర్‌ అధికమవుతోంది. నిన్న హరియాణాలోని గురుగ్రామ్‌లో ఆటో డ్రైవర్‌ను ఓ యువతి తుపాకీతో కాల్చబోయిన ఘటన మరవక ముందే బీహార్‌లోని గోర్గి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అటువంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. చిన్న విషయానికే ఆగ్రహంతో ఊగిపోయిన ఓ వ్యక్తి... బాలుడిని తుపాకీతో కాల్చాడు.. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

షేర్‌గర్‌ గ్రామ సమీపంలో పన్నెండేళ్ల ఓ బాలుడు స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. అయితే, అక్కడి తోటలోకి మామిడి పళ్లు కోసుకుందామని వెళ్లిన అతడిని యజమాని చూశాడు. ఆ బాలుడు భయంతో పరుగులు తీస్తుండడంతో తుపాకీతో కాల్చాడు. బుల్లెట్‌ ఆ బాలుడి తలలోకి దూసుకుపోవడంతో మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

More Telugu News