prabhas: నాన్ స్టాప్ గా 'సాహో' సన్నివేశాల చిత్రీకరణ

  • షూటింగు దశలో 'సాహో' 
  • కథానాయికగా శ్రద్ధా కపూర్
  • విలన్ గా నీల్ నితిన్ ముఖేశ్  

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా రూపొందుతోంది. ప్రభాస్ కథానాయకుడిగా .. శ్రద్ధా కపూర్ కథానాయికగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. నెల రోజులుగా 'అబుదాబి'లోని వివిధ ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కంపోజ్ చేసిన భారీ యాక్షన్ సీన్స్ ను ఇప్పటికే చిత్రీకరించారు.

హాలీవుడ్ మూవీస్ లోని యాక్షన్స్ సీన్స్ రేంజ్ లో ఈ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించారట. మరో నెల రోజుల పాటు ఈ సినిమా టీమ్ అక్కడే వుండనున్నట్టు తెలుస్తోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను నెల రోజుల పాటు చిత్రీకరించి .. జూలై నెలాఖరున తిరిగి వస్తారట. వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. శ్రద్ధా కపూర్ గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.  

More Telugu News