karthi: 'చినబాబు'గా రానున్న కార్తీ .. ఆడియో వేదిక ఖరారు

  • కార్తీ కథానాయకుడిగా 'చినబాబు'
  • రైతుల సమస్యలపై పోరాటం 
  • కథానాయికగా సాయేషా సైగల్  

పాండిరాజ్ దర్శకత్వంలో కార్తీ కథానాయకుడిగా తమిళంలో 'కడై కుట్టి సింగం' సినిమా రూపొందుతోంది. తెలుగులో ఈ సినిమాకి 'చినబాబు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కార్తీ రైతు పాత్రలో కనిపించనున్నాడు. రైతు సమస్యలపై పోరాడే పల్లెటూరి మొనగాడుగా ఆయన ఆకట్టుకోనున్నాడు.

ఈ సినిమాలో ఆయన సరసన కథానాయికగా సాయేషా సైగల్ నటిస్తోంది. ఈ సినిమాకి డి.ఇమాన్ సంగీతాన్ని సమకూర్చాడు. తెలుగులో ఈ సినిమా ఆడియో వేడుకను ఈ నెల 23వ తేదీ సాయంత్రం జరపనున్నారు. వైజాగ్ లోని 'సీఆర్ రెడ్డి కాన్వోకేషన్ హాల్' లో ఈ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తోన్న సూర్య ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

More Telugu News