Chandrababu: చికాగో సెక్స్ రాకెట్ పై వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ సంచలన వ్యాఖ్యలు

  • చికాగో సెక్స్ రాకెట్ ను టీడీపీలోని వ్యక్తులు నడుపుతున్నారు
  • తెలుగు వారి పరువు పోగొడుతున్నారు
  • చంద్రబాబు, లోకేష్ లకు తానా అధ్యక్షుడు సతీష్ సన్నిహితుడు

అమెరికాలో ఇటీవల బయటపడ్డ చికాగో సెక్స్ రాకెట్ గురించి వైసీపీ మహిళా నాయకురాలు వాసిరెడ్డి పద్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, టీడీపీలోని వ్యక్తులు, ఆ పార్టీలోని సన్నిహితులు ఈ సెక్స్ రాకెట్ నడుపుతున్నారని ఆరోపించారు.

అంతర్జాతీయ స్థాయిలో తెలుగు వారి పరువు పోగొడుతున్నారని ఆరోపించిన వాసిరెడ్డి పద్మ, ఈ వ్యవహారంలో తానా అధ్యక్షుడు వేమన సతీష్ ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) ప్రశ్నించినట్టు  తెలుస్తోందని, చంద్రబాబు, లోకేష్ లకు ఆయన అత్యంత సన్నిహితుడని అన్నారు. ఈ విషయమై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  

More Telugu News