keerti suresh: 'మహానటి' తరువాత కీర్తి సురేశ్ ఓకే చెప్పంది అందుకేనట!

  • 'మహానటి' సక్సెస్ తో మరింత క్రేజ్ 
  • తెలుగు నుంచి వరుస అవకాశాలు 
  • ఆల్రెడీ తమిళ సినిమాలతో బిజీ

'మహానటి' సినిమాతో ఒకేసారి తెలుగు ... తమిళ భాషల్లో కీర్తి సురేశ్ ఘన విజయాలను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఈ రెండు భాషల్లోను ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో తెలుగు నుంచి ఆమెకి వరుస అవకాశాలు వెళ్లాయి. అయితే డేట్స్ ఖాళీ లేవని చెప్పేసి .. ఆమె తమిళ సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఈ నేపథ్యంలో ఆమె తమిళ సినిమాలకే ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తోందనీ .. తెలుగు సినిమాల పట్ల అంతగా శ్రద్ధ పెట్టడం లేదనే ప్రచారం జరుగుతోంది.

ఈ విషయంపై కీర్తి సురేశ్ సన్నిహితులు స్పందిస్తూ .. "ప్రస్తుతం విక్రమ్ .. విజయ్ .. విశాల్ తో కీర్తి సురేశ్ చేస్తోన్న సినిమాలు అంతకుముందు కమిట్ అయినవేననీ, ఈ సినిమాలన్నీ కూడా సెట్స్ పై వున్న కారణంగానే కొత్తగా తెలుగు సినిమాలకు కీర్తి సురేశ్ డేట్స్ ఇవ్వలేకపోతోంది" అని చెప్పారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తరువాత తెలుగు సినిమాలపై కీర్తి దృష్టి పెడుతుందన్న మాట.    

More Telugu News