Vijayawada: రేపు విజయవాడ దుర్గ గుడిలో సామూహిక అక్షరాభ్యాసాలు!

  • రేపు అమ్మవారి జన్మ నక్షత్రం మూల
  • ఉదయం పది గంటలకు అక్షరాభ్యాస కార్యక్రమం
  • ఈ అవకాశాన్ని చిన్నారుల తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలి: ఈవో పద్మ

ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో విజయవాడ దుర్గగుడిలో ఉచితంగా సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించడం ఆనవాయతీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నామని దుర్గ గుడి ఈవో ఎం.పద్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, రేపు అమ్మవారి జన్మ నక్షత్రం మూల అని, ఉదయం పది గంటలకు అక్షరాభ్యాస కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు.

చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించదలచుకున్న తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారి పేర్లను www. kanakadurgamma.org వెబ్ సైట్ లో లేదా ఆలయ ప్రాంగణంలోని కార్యాలయంలో నమోదు చేసుకోవాలని తెలిపారు. అక్షరాభ్యాస కార్యక్రమానికి అవసరమైన సామాగ్రిని దేవస్థానం తరపున ఉచితంగా అందిస్తున్నట్టు చెప్పారు.

More Telugu News