Chiranjeevi: మీరిచ్చిన నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.. చిరంజీవి నివాసానికి వెళ్లి థ్యాంక్స్‌ చెప్పిన ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర

  • గతంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా చిరు
  • ఎంపీ ల్యాడ్స్‌ ద్వారా మచిలీపట్నంలో అభివృద్ధి కార్యక్రమాలు
  • పనులు జరుగుతున్నాయని చెప్పిన కొల్లు రవీంద్ర

కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో మెగాస్టార్‌ చిరంజీవి ఎంపీ ల్యాడ్స్‌ ద్వారా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులందించారు. మొత్తం రూ.5 కోట్లతో చేపట్టిన ఆ పనులు సమర్థవంతంగా జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసానికి వెళ్లిన కొల్లు రవీంద్ర.. ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఏడాదిలోగా మిగిలిన పనులన్నింటినీ పూర్తి చేస్తామని తెలిపారు. ఆ నియోజకవర్గ ప్రజలు చిరంజీవికి రుణపడి ఉంటారని చెప్పారు. మచిలీపట్నంలో అభివృద్ధి పనులు జరుగుతున్నందుకు సంతోషంగా ఉందని చిరంజీవి అన్నారు. 

More Telugu News