Pawan Kalyan: 24న పవన్ కల్యాణ్ కంటికి ఆపరేషన్!

  • గత మూడు నెలలుగా కంటి సమస్యతో బాధపడుతున్న పవన్
  • ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో ఆపరేషన్
  • 26 నుంచి యాత్ర పున:ప్రారంభం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కంటికి శస్త్ర చికిత్స జరగబోతోంది. ఈ నెల 24న ఆపరేషన్ చేయాలని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యులు నిర్ణయించారు. గత మూడు నెలలుగా ఆయన కంటి సమస్యతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే తన పోరాట యాత్రలో, సినిమా ఫంక్షన్లలో ఆయన నల్లటి కళ్లజోడు ధరించి కనిపించారు.

మరోవైపు ఈనెల 26 నుంచి ఆయన యాత్ర విశాఖ జిల్లాలో పున:ప్రారంభంకానుంది. తన భద్రతా సిబ్బందిలో ఉన్న ముస్లింల కోసం రంజాన్ సందర్భంగా యాత్రకు ఆయన తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఈ గ్యాప్ లోనే కంటికి ఆపరేషన్ చేయించుకోవాలని భావించారు. అయితే, కొంతకాలం ఆగాలని వైద్యులు సూచించడంతో, ఆపరేషన్ ఆలస్యం అయింది.

More Telugu News