KTR: రేపు విజయవాడకు వెళ్తున్న కేటీఆర్

  • కుటుంబంతో కలసి బెజవాడకు వెళ్తున్న కేటీఆర్
  • కనకదుర్గమ్మను దర్శించుకోనున్న దంపతులు
  • పున్నమి ఘాట్ లోని టూరిజం రిసార్ట్ లో బస

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ రేపు విజయవాడకు వెళ్లనున్నారు. సతీమణి షైలిమ, కుమారుడు హిమాన్షు, కుమార్తె అలేఖ్యలతో కలసి బెజవాడకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మను కేటీఆర్ దంపతులు దర్శించుకోనున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకోనున్నారు. ఈ పర్యటన సందర్భంగా పున్నమి ఘాట్ లోని టూరిజం రిసార్ట్స్ లో కేటీఆర్ కుటుంబం బసచేయనుంది. కేటీఆర్ పర్యటన సందర్భంగా టూరిజం రిసార్ట్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. 

More Telugu News