gopichand: తలసాని శ్రీనివాస్ చేతుల మీదుగా పంతం పాట విడుదల

  • గోపీచంద్ హీరోగా 'పంతం'
  • కథానాయికగా మెహ్రీన్
  • వచ్చేనెల 5వ తేదీన విడుదల  

చక్రి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా 'పంతం' సినిమా రూపొందింది. కథానాయికగా మెహ్రీన్ నటించిన ఈ సినిమా వచ్చేనెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను వదిలారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చేతుల మీదుగా ఈ సాంగ్ ను రిలీజ్ చేయించారు."హేయ్ ఆరడుగులున్న అందగాడు .. నాకెందుకో చూడగానే నచ్చినాడు" అంటూ సాగే ఈ పాటను భాస్కరభట్ల రాయగా .. గోపీసుందర్ సంగీత దర్శకత్వంలో సితార కృష్ణకుమార్ ఆలపించారు. సంగీత సాహిత్యాలు యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి. కొంతకాలంగా వరుస పరాజయాలతో వున్న గోపీచంద్ .. ఈ సినిమాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. ఇక మెహ్రీన్ కి కూడా ఈ సినిమా సక్సెస్ చాలా అవసరం. అందువలన ఆమె కూడా ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకుంది.

More Telugu News