Aamir Khan: బాలీవుడ్ సూపర్ హిట్ మూవీకి సీక్వెల్

  • త్వరలో 'సంజు' మూవీ రిలీజ్
  • ఆ తరువాత 'మున్నాభాయ్' 3వ భాగం  
  • సీక్వెల్ దిశగా 'త్రీ ఇడియట్స్'

బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాల జాబితాలో 'త్రీ ఇడియట్స్' ఒకటిగా కనిపిస్తుంది. అమీర్ ఖాన్ .. మాధవన్ .. షర్మాన్ జోషి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, 2009లో భారీ వసూళ్లతో ఘన విజయాన్ని అందుకుంది. రాజ్ కుమార్ హిరాని దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ ముగ్గురి హీరోల కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ చేయాలనే నిర్ణయానికి రాజ్ కుమార్ హిరాని వచ్చాడట.

ఆల్రెడీ ఆయన స్క్రిప్ట్ కి సంబంధించిన పనులను మొదలుపెట్టినట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన 'సంజు' సినిమా విడుదలకి సంబంధించిన పనుల్లో బిజీగా వున్నారు. ఆ తరువాత 'మున్నాభాయ్' 3వ భాగాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇది పూర్తయ్యాక 'త్రీ ఇడియట్స్'కి సీక్వెల్ ను పట్టాలెక్కించనున్నారని అంటున్నారు. మొత్తానికి రాజ్ కుమార్ హిరాని వరుస సీక్వెల్స్ పై దృష్టిపెట్టారన్నమాట.    

More Telugu News