nithin: 'శ్రీనివాస కల్యాణం' రిలీజ్ డేట్ విషయంలో దిల్ రాజు సెంటిమెంట్

  • నితిన్ హీరోగా 'శ్రీనివాస కల్యాణం'
  • ముగింపు దశలో చిత్రీకరణ  
  • కథానాయికలుగా రాశిఖన్నా .. నందిత శ్వేత  

దిల్ రాజు నిర్మాణంలో .. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో 'శ్రీనివాస కల్యాణం' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. నితిన్ హీరోగా చేస్తోన్న ఈ సినిమాలో కథానాయికలుగా రాశి ఖన్నా .. నందిత శ్వేత నటిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 9వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి దిల్ రాజు వచ్చినట్టుగా సమాచారం.గతంలో ఆయన నిర్మించిన 'బొమ్మరిల్లు' సినిమా, ఆగస్టు 9వ తేదీన విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఆ సెంటిమెంట్ కారణంగా అదే రోజున 'శ్రీనివాస కల్యాణం' సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతో ఆయన వున్నారు. ఆ దిశగానే పనులు జరుగుతున్నాయి కూడా. కుటుంబ కథా చిత్రాలు దిల్ రాజుకు మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. అలాగే ఈ సినిమా కూడా ఆయనకి బాగా కలిసొస్తుందేమో చూడాలి. 

More Telugu News