Tirumala: తిరుమల వెంకన్నకు గుర్తు తెలియని భక్తుని భూరి విరాళం!

  • రూ. 2.10 కోట్ల విరాళం
  • శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్ట్ పేరిట డీడీలు
  • తమిళనాడుకు చెందిన భక్తుడిగా అనుమానం

కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి ఓ అజ్ఞాత భక్తుడు భారీ విరాళాన్ని అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్ట్ కు ఓ భక్తుడి నుంచి రూ. 2.10 కోట్ల విరాళం అందింది. రూ. 2 కోట్లకు రెండు డీడీలు, రూ. 10 లక్షలకు ఒక డీడీని విడివిడిగా తిరుమల డోనార్ సెల్ లో ఇచ్చి వెళ్లాడా భక్తుడు. అతను తమిళనాడు వాసి అన్న వివరాలు మినహా మరేమీ తెలియదు.

ఇదే సమయంలో హైదరాబాద్ కు చెందిన మనోర్ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఎం శ్రీనివాసరావు రూ. 10 లక్షలను విరాళంగా ఇచ్చారని టీటీడీ అధికారులు తెలిపారు. కాగా, తిరుమలకు వచ్చే భక్తుల్లో తమ వివరాలు తెలియనీయకుండా స్వామివారికి కోట్ల విలువైన కానుకలు సమర్పించి వెళ్లిపోయే వారు ఎందరో ఉంటారన్న సంగతి తెలిసిందే.

More Telugu News