shriya: శ్రియ .. నిహారిక ప్రధాన పాత్రలుగా కొత్త సినిమా ప్రారంభం

  • నిర్మాతగా మారిన సినిమాటోగ్రఫర్ 
  • దర్శకురాలిగా సుజన పరిచయం 
  • త్వరలోనే పూర్తివివరాలు    

తెలుగు తెరను లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అడపాదడపా పలకరిస్తూనే వస్తున్నాయి. అలా తాజాగా ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ రెడీ అవుతోంది. శ్రియ .. నిహారిక ప్రధానమైన పాత్రలను పోషించనున్న ఈ సినిమాను కొంతసేపటి క్రితమే లాంచ్ చేశారు. సినిమాటోగ్రఫర్ జ్ఞానశేఖర్ ఈ సినిమాతో నిర్మాతగా మారగా, సుజన దర్శకురాలిగా పరిచయమవుతోంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు క్రిష్ .. హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వరుణ్ తేజ్ క్లాప్ ఇవ్వగా .. ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకుడిగా క్రిష్ వ్యవహరించారు. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. వైవిధ్యభరితమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందుతుందనీ, శ్రియ .. నిహారిక కెరియర్లో ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.     

More Telugu News