Anjali: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • అంజలి నాయికగా 'గీతాంజలి' సీక్వెల్ 
  • వర్మ నిర్మిస్తున్న వయోలెంట్ లవ్ స్టోరీ
  • 'నన్ను దోచుకుందువటే' అంటున్న సుధీర్ బాబు 

*  గతంలో వచ్చిన హారర్ చిత్రం 'గీతాంజలి'కి సీక్వెల్ రూపొందుతోంది. ఇందులో కూడా కథానాయికగా అంజలి నటిస్తోంది. ఎంవీవీ సినిమాస్ బ్యానర్ తో కలసి రచయిత కోన వెంకట్ దీనిని నిర్మిస్తున్నారు.  
*  ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలుగు, కన్నడ భాషల్లో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి 'భైరవగీత' అనే టైటిల్ని తాజాగా నిర్ణయించారు. నూతన దర్శకుడు సిద్ధార్థ దర్శకత్వం వహించే ఈ చిత్రం వయోలెంట్ లవ్ స్టోరీగా రూపొందుతుంది.
*  తాజాగా 'సమ్మోహనం' హిట్ తో మంచి జోష్ మీదున్న హీరో సుధీర్ బాబు ప్రస్తుతం తన సొంత బ్యానర్ పై ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆర్.ఎస్.నాయుడు దర్శకత్వం వహిస్తున్న  ఈ చిత్రానికి 'నన్ను దోచుకుందువటే' అనే టైటిల్ని ఖరారు చేశారు. ఇందులో సుధీర్ బాబు, నభ నటేష్ జంటగా నటిస్తున్నారు. 

More Telugu News