mehreen: సెక్స్ రాకెట్ గురించి నన్ను అరగంట ప్రశ్నించారు.. షాక్ అయ్యా: హీరోయిన్ మెహ్రీన్

  • కలకలం రేపుతున్న అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్
  • అమెరికా విమానాశ్రయంలో మెహ్రీన్ విచారణ
  • మరో ముగ్గురు హీరోయిన్లను కూడా విచారించినట్టు సమాచారం

అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్ ఉదంతం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, హీరోయిన్ మెహ్రీన్ కు అమెరికాలో చేదు అనుభవం ఎదురైంది. అక్కడ ఓ విమానాశ్రయంలో ఆమెను అరగంట సేపు అధికారులు విచారించారు. ఈ విషయాన్ని స్వయంగా తనే తెలిపింది.

తన తల్లిదండ్రులను కలిసేందుకు కెనడాలోని వాంకూవర్ నుంచి అమెరికాకు వెళ్తుండగా, అమెరికాలోని విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు తనను ఆపేశారని మెహ్రీన్ తెలిపింది. తాను టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసుకున్న అధికారులు అరగంట సేపు ప్రశ్నించారని చెప్పింది. సెక్స్ రాకెట్ కు సంబంధించి తనను ప్రశ్నించారని... తాను షాక్ కు గురయ్యానని తెలిపింది. టాలీవుడ్ నిర్మాత అమెరికాలో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నాడనే విషయం తనకు ఇంతవరకు తెలియదని చెప్పింది. ఈ విషయం ఇమిగ్రేషన్ అధికారులు చెప్పాకే తెలిసిందని వెల్లడించింది. అమెరికాకు వచ్చే ప్రతి నటిని విచారిస్తున్నట్టు అధికారులు చెప్పారని తెలిపింది. మరో ముగ్గురు హీరోయిన్లను కూడా దాదాపు 6 గంటల సేపు విచారించినట్టు తెలుస్తోంది.

ఎన్నారై మోదుగుమూడి కిషన్ తన భార్య చంద్రతో కలసి టాలీవుడ్ కు చెందిన నటీమణులతో అమెరికాలో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. తెలుగు సినిమాలను కూడా నిర్మించిన అతను... సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ నమ్మించి, వారిని వ్యభిచారంలోకి దింపుతున్నాడు. ఈ విషయం అక్కడి పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో, భార్యాభర్తలు ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. 

More Telugu News